Friday, July 18, 2025

కర్మ సిద్ధాంతం

కర్మ సిద్ధాంతం అనేది భారతీయ తత్వశాస్త్రంలో చాలా ముఖ్యమైన భాగం. కర్మ అంటే కేవలం మనం చేసే పనులే కాకుండా, ఆ పనులు చేయడానికి మనలో కలిగే ఉద్దేశం కూడా కర్మ కిందకే వస్తుంది. కర్మలు ప్రధానంగా మూడు రకాలు:
 * సంచిత కర్మ: గత జన్మలలో మనం కూడబెట్టుకున్న మొత్తం కర్మల రాశిని "సంచిత కర్మ" అంటారు. ఇది ఒక బ్యాంక్ అకౌంట్‌లో జమ చేసిన డబ్బు లాంటిది.
 * ప్రారబ్ధ కర్మ: సంచిత కర్మలో నుండి ఈ జన్మలో మనం అనుభవించడానికి సిద్ధంగా ఉన్న కర్మల భాగం "ప్రారబ్ధ కర్మ". ఇది బ్యాంక్ అకౌంట్ నుండి ఈ రోజు మనం ఖర్చు పెట్టే డబ్బు లాంటిది. దీన్ని అనుభవించక తప్పదు.
 * ఆగామి కర్మ (క్రియమాణ కర్మ): ఈ జన్మలో మనం చేసే పనుల వల్ల ఏర్పడే కొత్త కర్మలు "ఆగామి కర్మ". వీటి ఫలితాలు భవిష్యత్తులో (ఈ జన్మలో లేదా వచ్చే జన్మలలో) ఉంటాయి.
మీరు అడిగిన "కర్మ లో సంచితం ఎలా చెయ్యాలి" అనే ప్రశ్నకు, సంచితం అంటే కర్మను కూడబెట్టడం. ఇది మనం చేసే ప్రతి పని, ఆలోచన, మాట ద్వారా జరుగుతుంది. మంచి పనులు చేస్తే మంచి సంచితం, చెడు పనులు చేస్తే చెడు సంచితం ఏర్పడుతుంది.
అయితే, ముఖ్యంగా కర్మలను తగ్గించుకొని, వాటి బంధాల నుండి విముక్తి పొందడానికి మార్గాలను తెలుసుకోవడం అవసరం. దానికి కొన్ని మార్గాలు ఇక్కడ ఉన్నాయి:
కర్మలను తగ్గించుకునే మార్గాలు
1. నిష్కామ కర్మ
ఫలాపేక్ష లేకుండా పనులు చేయడం: భగవద్గీతలో చెప్పినట్లు, మనం చేసే పనుల ఫలితాల పట్ల ఆశ లేకుండా, కేవలం మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. "నేను చేస్తున్నాను" అనే అహంకారాన్ని విడనాడి, ప్రకృతి మనల్ని ఒక పనిముట్టుగా ఎన్నుకుందని భావించాలి. ఇది కొత్త ఆగామి కర్మలు ఏర్పడకుండా సహాయపడుతుంది.
2. ధ్యానం మరియు ఆధ్యాత్మిక సాధన
మనసును నియంత్రించడం: ఆలోచనలను తగ్గించి, మనసును శూన్యం చేయడం ద్వారా కాంతి మనలోకి ప్రవేశించి శక్తిగా మారుతుంది. ఇది కర్మల ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. శ్వాసపై ధ్యాస పెట్టడం, ఇతర ధ్యాన పద్ధతులు మనసును ప్రశాంతంగా ఉంచుతాయి.
3. సత్కర్మలు ఆచరించడం
మంచి పనులు చేయడం: ఇతరులకు సహాయం చేయడం, దానధర్మాలు చేయడం, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనడం వంటి మంచి పనులు పుణ్య కర్మలను పెంచుతాయి. ఇవి పాత కర్మల ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
4. జ్ఞానం పొందడం
కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడం: కర్మల స్వభావాన్ని, వాటి పనితీరును అర్థం చేసుకోవడం ద్వారా మనం సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం. జ్ఞానం పెరిగే కొద్దీ కర్మ బంధాలు బలహీనపడతాయి.
5. కర్మ సమర్పణ
కర్మ ఫలాలను దైవానికి సమర్పించడం: రాత్రి పడుకునే ముందు లేదా ఉదయం నిద్ర లేవగానే, మనం చేసిన పనులన్నింటినీ, వాటి ఫలితాలను దైవానికి సమర్పించి, ఫలితాల పట్ల ఆశ లేకుండా ఉండటం ద్వారా కర్మ బంధాల నుండి విముక్తి పొందవచ్చు.
ముఖ్య గమనిక: కర్మ సిద్ధాంతం ప్రకారం, మనం చేసిన కర్మల ఫలితాలను అనుభవించక తప్పదు. అయితే, ఈ పైన చెప్పిన మార్గాలను అనుసరించడం ద్వారా కర్మల బంధాన్ని తగ్గించుకొని, మోక్షానికి మార్గం సుగమం చేసుకోవచ్చు.
మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి, మీరు కర్మల గురించి ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా?

Sunday, March 30, 2025

ఉగాది పంచాంగ శ్రవణ విశేషం

్త నక్షత్రంతో కూడి ఉంటాడు. సూర్యుడు కూడా మొదటిరాశియైన మేషరాశిలో సంచరిస్తున్నాడు.
----------------------------------------
ప్రభవ నామ సంవత్సరంతో ప్రారంభమైన తెలుగు సంవత్సరాలు అక్షయతో ముగుస్తాయి.       అంటే మనిషి పుట్టిన సంవత్సరం నుంచి తిరిగి అరవై ఏళ్ల తర్వాత అదే సంవత్సరం మొదలువుతుంది.
అప్పటి నుంచి మళ్లీ బాల్యావస్థ మొదలవుతుంది.
అంటే చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తుంటారు. అకారణంగా అలగడం, అవీ.. ఇవీ తినాలని అడగటం, చిన్న చిన్న దొంగతనాలు చేయటం, ఎక్కువసేపు నిద్రపోవటం, చిన్న విషయాలకే ఆనంద పడటం, కోపం తెచ్చుకోవటం, కన్నీళ్లు పెట్టుకోవడం ఇలాంటి బాల్య చేష్టలన్నీ అరవైఏళ్ల నుంచి నెమ్మదిగా ప్రారంభమవుతాయి.
ప్రతి కొడుకూ అరవై సంవత్సరాలు వచ్చిన నాటి నుంచి తన తండ్రిని తన బిడ్డలతో సమానంగా చూసుకోవాలని ధర్మశాస్త్రం చెబుతోంది. 
ఆరుపదుల జీవితాన్ని ఎవరైతే ఆనందంగా జీవిస్తారో వారి జీవితం ధన్యం. ఆ ధన్యజీవితపు జ్ఞాపకార్థమే బిడ్డలు, మనవళ్లు బంధువులు మిత్రులు కలిసి ‘షష్టిపూర్తి చేస్తారు’.
----------------------------------------
ఇక ధర్మశాస్త్రం ప్రకారం చూసుకుంటే
కృత, త్రేతా, ద్వాపర యుగాల్లో మానవ ఆయుర్దాయం 180 సంవత్సరాలు.
కలియుగానికి వచ్చే సరికి కలి ప్రభావంతో 120 సంవత్సరాలకు పడిపోయింది.
అందుకే 60ఏళ్లు పూర్తవగానే షష్టి పూర్తి చేస్తారు. అంటే దీనర్థం. మొదటి 60ఏళ్లు పూర్తవగానే లోక సంబంధ విషయాలు పూర్తయినట్లు భావించాలి. మిగిలిన 60ఏళ్లు ఆధ్యాత్మిక చింతనతో బతకాలని ధర్మశాస్త్రం చెబుతోంది.
-----------------------------------
*పురాణ గాథ!*
-------------------------------------
ఒకానొక సమయంలో నారద మునీంద్రుడు తానంత గొప్ప భక్తుడు లేడని, ఆ గర్వంతో విర్ర వీగుతున్నాడట. అప్పుడు  శ్రీమహా విష్ణుడు అతడికి జ్ఞాన బోధ చేయాలని తలంచాడు.
దీంతో నారదుడిని మాయ ఆవరించేలా చేసి ఒక సరస్సు తీసుకెళ్లి అందులో దిగి స్నానం చేయమన్నాడు. నారదుడు అందులో దిగి స్నానం చేయగానే, ఒక్కసారి పూర్వ స్మృతిని మర్చిపోయి, స్త్రీ రూపం ఎత్తాడు.
అదే సమయంలో దారితప్పి అక్కడకు వచ్చిన ఓ మహారాజును చూసి మోహించి, వివాహం చేసుకుని 60మంది పిల్లలను కన్నాడు.
వారే.. ప్రభవ.. విభవ.. శుక్ల.. చివరిగా అక్షయ. వారంతా ఒకరి తర్వాత ఒకరు యుద్ధంలో మరణిస్తుండటంతో పుత్రశోకంతో ఉండిపోయాడు. సంసార సాగరంలో మునిగిపోయి అసలు తానెవరో మర్చిపోయాడు. అప్పుడు నారదుడిని ఆవరించిన మాయను శ్రీహరి తొలగించి, ఇదీ సంసారం అంటే.. నీవు ఏదో గొప్ప భక్తుడవని భావిస్తున్నావు. అని జ్ఞానబోధ చేశాడట.
నీ పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారు అని విష్ణుమూర్తి వరమిస్తాడు. అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి.        ----------------------------------
       *ఉగాది పండుగ*
----------------------------------- *కాలాన్ని భగవద్రూపంగా భావిస్తే ప్రతిరోజూ, ప్రతి నిముషమూ పండుగే! ఆనందమే! ఇట్టి పవిత్రవిశాల భావన లేకుండా ఆచరించే పండుగలు దండుగలే అవుతాయి. పిండివంటలూ, మధురపదార్ధాలూ తిని, రజస్తమోగుణాలు నింపుకోవడం తప్ప - సాత్త్విక ప్రవృత్తి లభించదు. కనుకనే మనపూర్వులు ప్రతిపండుగకూ ఒక అధిష్ఠానదైవం, పూజ, నియమాలూ, ఆహార విశేషాలూ ఏర్పాటు చేసినారు. పవిత్రభావంతో చేసే ప్రతి కార్యమూ ఇహపర ఆనందదాయకమే అవుతుంది.*
--------------------------------------       *''ఉగాది'' ప్రత్యేకించి - ఇతర వ్రతాలూ, పండుగల వలె ఏదో వొక దేవతను ఉద్దేశించి చేసేది కాదు. ఆనంతమైన కాలాన్ని - మన సౌలభ్యగణనం కోసం సంవత్సరాత్మకంగా లెక్కించి, సంవత్సరాదినాడు కాలాన్ని మన ఇష్ట దైవస్వరూపంగానూ, సకల దేవతా స్వరూపం గానూ భావించి, సంవత్సరకాల భవిష్యత్తును ముందుగా తెలుసుకొని ఆయా సమయాల్లో దైవానుగ్రహ ప్రాప్తికై చేయాల్సిన సాధనాలను సిద్ధపరచుకొనే ఒక చక్కని శాస్త్రీయ ప్రణాళికకు పూర్వరంగం ఏర్పరచుకోవడం ఉగాది విశిష్టత.*
---------------------------------------  *కాలగణనంలో ఒకప్పుడు మార్గశిరంతోనూ, వైశాఖంతోనూ, కార్తికంతోనూ, ఆశ్వయుజంతోనూ ఇలా అనేకవిధాలుగా సంవత్సరం ప్రారంభమైన విశేషాలు మనవాఙ్మయంలో కన్పిస్తున్నాయి. అట్లే యుగ ప్రారంభ తిథి విషయంలోనూ కల్ప, మన్వంతరాది భేదాన్నిబట్టి తేడాలున్నాయి. నక్షత్రాలను కూడా యుగాది నక్షత్రాలుగా పేర్కొన్నారు.*
  -------------------------------------          *వరహమిహిరాచార్యుని నిర్ణయాన్నిబట్టి, మనం చాంద్రమానం రీత్యా చైత్రమాసాన్నే సంవత్సరారంభంగా భావించి, చైత్ర శుక్ల ప్రతిపత్తు (పాడ్యమి) నాడు బ్రహ్మ సృష్టిని ప్రారంభించినాడన్న శాస్త్రవాక్కును ప్రమాణంగా గైకొని, దీన్నే ''యుగాది''గా గణించి, ఉగాది పండుగను ఆచరిస్తున్నాము. ప్రతి దేశంలోనివారూ, రాష్ట్రంలోనివారూ ఏదోవొక కాలగణనంతో ఉగాది పండుగను తమ సంప్రదాయం ప్రకారం జరుపుకొంటూనే ఉన్నారు. ఆచరించే విధానంలో తేడా వున్నా ఆశయంలో, ఆనందంలో మాత్రం తేడాలేదు.*
-------------------------------------    *తెలుగువారేకాక, కర్ణాటకులు, మహారాష్ట్రులు, చాంద్రమానాన్ని అనుసరించే మాళవీయులు మున్నగు వారు,రునూ ఉగాది పండుగను చైత్ర శుక్ల పాడ్యమినాడే ఆచరిస్తున్నారు.*
-------------------------------------
*మనం జీవిస్తున్న ఈసృష్టి జరిగిన రోజును పండుగగా మనం పుట్టినరోజును పండుగగా జరుపుకొంటున్నట్లుగా భావించి, ఈ ఉగాది పండుగను ఆనందంతో సంవత్సరంలో తొలిపండుగగా జరుపు కొంటున్నాము. జరుపుకోవాలి కూడా!*
--------------------------------------
*సూర్యోదయానికి పాడ్యమి ఉన్న రోజునే (చైత్రశుక్ల పాడ్యమి) ఈ పండుగను ఆచరించాలి.*
---------------------------------------
*"చైత్రేమాసి" జగద్ర్బహ్మా ససర్జ ప్రథమేsహని*

*శుక్లపక్షే సమగ్రంతు తదా సూర్యోదయే సతి"*
---------------------------------------        *అని హేమాద్రి నిర్ణయం! కనుక చైత్రశుద్ధపాడ్యమి సంవత్సరాది. ఉదయానికి పాడ్యమి ఉండాలి. బ్రహ్మదేవుడు చైత్రశుద్ధపాడ్యమి, సూర్యోదయవేళ ఈ సృష్టిని సమగ్రంగా చేసినాడు. అందుకు కృతజ్ఞతాసూచకంగా, జ్ఞాపక చిహ్నంగా యుగాది పండుగ జరుపుకొంటున్నాము.*
------------------------------------         
*చైత్రశుద్ధ పాడ్యమినాడు ఉపవాస ముండి, బ్రహ్మను పూజించినవారు సంవత్సరమంతా సుఖంగా ఉంటారు. ఒకవేళ చైత్రం అధికమాసంగా వస్తే, అధికమాస ప్రారంభంనాడే ఉగాది జరుపుకోవాలి. అంతేకాని నిజచైత్రారంభంలో కాదు.*
-------------------------------------

Wednesday, January 8, 2025

సంక్రమణ పుణ్యకాలం - పురుష లక్షణం

బోగి-: 13/01/25పుష్య శుద్ధ చతుర్దశి/పౌర్ణమి. సోమవారం
సాయంత్రం 05 తర్వాత భోగి పళ్ళు వేయడం  చేయవచ్చును

మకర సంక్రాంతి -:మకర సంక్రమణ ఉత్తరాన పుణ్యకాలాన్ని పదవ సంక్రమణము అయనమనే పేరుతో ఉంటుంది
సంక్రాంతి -: 14/01/25 పుష్య బహుళ పాడ్యమి మంగళవారం పుణ్య కాలం 
మ02-45  పుణ్యకాల సమయమునకు 
తరువాత (పర) సమయంలో  40 గడియలు అనగా  16 గంటలు అనగా రాత్రి 06 గంటల 45 నిమిషాలు వరకు ప్రభావం వుండును (15/01/24 తెల్లవారుజామున 02 గంటల నుండి ఉదయము 6:45 నిమిషాల లోపున పెద్దలకి సంబంధితమైన బియ్యాలు ఇవ్వడం చేయుట చాలా మంచిది) 

సంక్రాంతి పుణ్యకాల దీపారాధన చేయాలన్న పుణ్యకాలానికి 10 గడియలు ముందు నుంచి ప్రారంభం చేసుకోవచ్చు 
14/01/25 ఉదయం 10 గంటల తర్వాత దీపారాధన చేసుకొని పెద్దలకి సంబంధించిన బట్టలు పెట్టుకోవచ్చును

కనుము-:15/01/25 పుష్య బహుళ విదియ  బుధవారం

ముక్కనుము -: 16/01/25 పుష్య బహుళ తదియ గురువారం