Tuesday, August 6, 2019

మనము తెలుసుకోవలసిన విషయాలు

పంచగము,పురాణలు,ధర్మగ్రంథాలు అన్ని
పరిశీలించి పంతులుగారు నిర్ణయం చేసి 
చేబుతారు కావున మా చుట్టుపక్కల వాళ్ళు
ఇలా చేశారు,ఇంటిలో వాళ్ళు అలా చేబుతున్నారు 
అని పంతులుగారు ని తప్పుతోవ పట్టించారాదు
ఆలోచించి మీ పేరు బలమునకు సరి పోయిన
ముహూర్తం పంతులుగారు ఇచ్చింది ఆచరించుట చాలా మంచిది 



1.ముఖ్యముగా మగపిల్లలు  అన్నప్రాసన, 
పుట్టజుట్టులు 6,8,10,12  నెలలో  చెయ్యాలి

2.ముఖ్యముగా ఆడపిల్లలు  అన్నప్రాసన, 
పుట్టజుట్టులు 7,9,11 నెలలో  చెయ్యాలి

3. గర్భిణి స్త్రీలని పురుటీకి పంపించుటకు
7,9  నెలలో  అమ్మగారింటికి పంపించాలి
తల్లిని,పిల్లని(పురటాలని) అత్తవారింట్లో అడుగు పెట్టకు 1,3,5,9 నెలలు మంచివి
(శూన్యమాసం అయిన,మూడమి అయిన,పుష్యం,
అషాడం,భాద్రపదం, నెలగంట అయిన పంపవచ్చును)
నెలలు ప్రకారము చెయ్యేదానికి పైన మాసములు దోషం లేదు కావున 

4. సంవత్సరాలలోపు కొత్త ఇంటిలో దిగ మంటున్నారు 
 

ఇల్లు ప్రారంభం చేసిన మొదటి సంవత్సరంలోనే ఇంటిలో దిగాలి అని  శాస్త్ర ప్రకారం గా ఎక్కడా లేదు
 ఎక్కవ సంవత్సరములు నిర్మాణం చేయకూడదని మాత్రమే ఉన్నది, అదేవిధంగా ద్వారా రోహణ ,స్లాబు, తలుపులు, గుమ్మడికాయ కొట్టకుండా ప్రవేశం చేయకూడదు, మరల గృహప్రవేశం చేసిన తర్వాత కూడా దేవుని కదిపి ఎక్కువకాలం గృహ లోపల భాగం లో కొంత పని ఉంచి గృహప్రవేశం చేసుకోవడము అంటే గృహ వెలుపల ఉంచుకొని ప్రవేశం చేయాలి కావున శంకుస్థాపన చేసిన యజమాని పేరున ముహూర్తబలం ఎప్పుడు ఉంటే అప్పుడే ప్రవేశం చేయాలి గాని ఇన్ని రోజుల లోపల చెయ్యాలి అనేది ఎక్కడా కూడా లేదు 

 మంచి ముహూర్తం పంతులుగారు ని అడిగి తీసుకుని వెల్లవచ్చును

స్త్రీలు చేయకూడని పనులు

గ్రహణ సమయమందు భూమ్యాకర్షణ శక్తి మార్పు చెందుతుంది. దాని పరిమాణము మనపై చాల ఉంటుంది ముఖ్యముగా మన కడుపులో ఆహార పదార్థములు జీర్ణమవ్వడానికి కావలసిన ఆమ్లములు ఉండవు అందువల్ల జీర్ణము కాదు ఈ కారణముగానే గ్రహణ సమయమునకు ముందుగ మూడు గంటలకు పూర్వమే మన కడుపులో ఏమి ఉండకూడదు అంటారు.

మీ భర్త పిల్లలు మంగళ వారము నాడు క్షవరము గడ్డము గీసుకోవడము చేయనీయ వద్దు. ఈ ప్రక్రియ దరిద్రాన్ని సంభవింప చేయును.



మీరు మీ పిల్లలు దిండు పైన కూర్చో వద్దు ఐతే ఈ కాలములో అందరూ దీనిని తప్పక చేస్తుంటారు.

స్త్రీలు రాత్రి సమయమున గాజులు కమ్మలు తీయరాదు. దుఃఖము విచారణ చేయ వచ్చిన వారిని ఆహ్వానించ కూడదు. అలాగే వారు పోయేటప్పుడు వెళ్ళి వస్తానని చెప్ప కూడదు.
ఈ మధ్య కాలంలో దుఃఖము విచారించ వచ్చిన వారిని రండి రండి అంటూ సాదరముగా ఆహ్వానించి స్థలము ఇచ్చి కూర్చోపెట్టి కాపీలు ఇచ్చి చాల అతిథి మర్యాదలు చేస్తారు .అపరోక్షముగా మనము అశుభములను కోరుకోవడానికి ఇది నాంది అవుతుంది.

కొత్త వస్త్రములను ధరించే ముందు దానికి కొంత పసుపు ఏదైనా ఒక మూల రాయాలి, పసుపు క్రిమి నాసిని.

ఒకరు ధరించిన పూలను మరొకరు పెట్టుకోడదు అయితే ఈ మధ్య కాలములో ఈ పని చాల చోట్లలో సహజమై పోయింది.


నలుపు రంగు వస్తువులు బట్టలు ధరించ కండి ఈ మధ్య కాలంలో సువాసిని స్త్రీలుకుడా నలుపు రంగు వస్తువులు ధరించడం ఎక్కువై పోయింది.

ఉప్పు మిరప చింతపండు వీటిని ఎవరికి ఇచ్చిన చేతిలో ఇవ్వకూడదు ,కింద పెట్టండి వాళ్ళే తీసుకొంటారు .ఈ మద్య కాలంలో ఉప్పు చేతితో వడ్డించడం చాల చోట్లలో గమనిస్తాము.

ప్రతి రోజు భోజనమునకు ముందు కాకికి అన్నము పెట్టండి, ఇది పితృ దేవతలకు ప్రీతి .కాకికి మనము భోజనము చేయుటకు ముందు కుక్కకు మనము తిన్న తర్వాత పెట్టాలి.

అయితే కుక్కలను ఎల్లప్ప్పుడు కన్న సంతానానికంటే ఎక్కువగా లాలిస్తూ దాని నోటికి ఆకులోంచి అందిస్తూ భోజనము చేయడము ఎక్కువై పోయింది.

టెంకాయ చిప్ప తామ్బులము ఇచ్చేటప్పుడు మూడు కండ్లు వుండే భాగము మీరు ఉంచుకొని మిగత భాగము ఇతరులకు ఇవ్వవలెను.

స్త్రీలు ఎప్పుడు జుట్టు విరపోసుకొని ఉండకూడదు .ఇది జ్యేష్టాదేవి స్వరూపము ఇంటిలో మంగళము జరుగుటకు విఘ్న కారణమవుతుంది. ఈ చర్య ప్రతి గృహములో ఇప్పుడు ఒక తప్పని సరి అయిపొయింది.

శుక్రవారమునాడు గాని ,జీతము రాగానే గాని ఆ డబ్బుతో మొట్ట మొదటి సారి ఉప్పు కొనండి ఈ చర్య పై పై డబ్బులు చేరటానికి అవకాశము ఎక్కువ.

కాలిపైకాలు వేసుకొని కుర్చోవడము, కాళ్లాడిస్తూ కూచోవడం, ఒంటి కాలితో నిలవడం, స్తిరముగా నిలవక ఉగుతుండడం లాంటి పనులు చేయకూడదు ఇందువల్ల ఒకటి దారిద్ర హేతువు మరియొకటి ఆ ప్రదేశములు బలహీనమై త్వరగా విరుగుటకు అవకాశములు ఎక్కువ.

ఎల్లప్పుడు ఇచ్చి పుచ్చుకోవడానికి కుడి చేతిని అలవాటు చేయాలి ,ఎడమ చేతిని ఉపయోగించ కూడదు.

సుమంగళి స్త్రీలు రాత్రి వేళలందు అలిగి ,ఆహారము తినకుండా నిద్రించ కూడదు.

స్త్రీలు బహిష్టు సమయమందు పూలు తలలో పెట్టుకోరాదు. పూలు వాకిట్లో అమ్మడానికి వస్తే నాకు వద్దు అని చెప్పు రాదు ,రేపు తీసుకుంటాను అని అనవలెను.

ఎప్పుడు మన నోటినుండి పీడ ,దరిద్రం, శని పీనుగా కష్టము, అనే పదములను ఎప్పుడు ఉపయోగించ కూడదు.

ఇంటిలో దుమ్ము ధూళి, సాలెగూడు కట్టడం లాంటివి దారిద్ర హేతువులు, పదిరోజులకు ఒకమారు మంగళ శుక్ర వారములు కాకుండా దులిపి శుభ్రము చేయవలెను.

శ్రాద్ధ దినమందు ఇంటి ముందు ముగ్గు శ్రాద్ధము అయ్యేవరకు వేయకూడదు, శ్రాద్ధానంతరము ముగ్గు వేసి తర్వాత ఇంటిలోని వారు భోజనము చేయవలెను

No comments:

Post a Comment